ధర్పల్లి మండలంలోని పలు గ్రామాలలో కురిసిన వడగళ్ల వాన
ఆదివారం :05/04/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండలంలోని పలు గ్రామాలలో ఇటీవల కురిసిన వడగళ్ల వాన కారణంగా రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ముఖ్యంగా పంట పొలాలు, మామిడి తోటలు కరెంటు తీగలు ట్రాన్స్ఫర్ తీవ్రంగా దెబ్బతిన్నాయి సేన్ల మీద. కృష్ణ మందిర్ ఏరియా, తమ్మురోడు భాగు, దుబ్బాక తోవ, రేకులపల్లి తోవ, దమ్మన్నపేట తోవ, డీబీ తాండ, మరియా తండా, బిలియ తండా, ఇంద్ర నగర్ తాండ గోవిందపల్లి రామడుగు ధర్పల్లి మండలం ప్రాంతాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మనవి చేస్తున్నాము. అలాగే స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి నష్టం అంచనా వేయించి, రైతులకు తక్షణ నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము జై జవాన్ జై కిసాన్ బిజెపి మండల అధ్యక్షుడు జిర్రా మహిపాల్ హరిచంద్ర కర్క బాల్రెడ్డి మహేష్ రాజేశ్వర్ గణేష్ రైతులు పాల్గొన్నారు























