నిజామాబాద్, మార్చి 11 : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నూతనంగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఉదయం 10 గంటలకు అమృత గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఆయా గ్రామాల సర్పంచులకు, భూమారెడ్డి కన్వెన్షన్ హాల్ లో నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లకు, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ చైర్ పర్సన్ లకు, వైస్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమం ప్రారంభం అవుతుందని అన్నారు.























