నేడు రాత్రి సమయంలో * నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్.,* నిజామాబాద్ నగరంలో కామ దహనము మరియు హోలీ పండుగ నేపథ్యంలో నగరంలో పలు ప్రాంతాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు మరియు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రధానంగా ప్రజలు ఎవరు కూడా ఎక్కువ గుమిగూడకుండా తగు చర్యలు తీసుకోవాలని మరియు హోలీ సందర్భంగా గల ఆంక్షలును ప్రతి ఒక్కరు తూ.చా తప్పకుండా పాటించే విధంగా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎల్లమ్మ గుట్ట , దేవి థియేటర్ చౌరస్తా, పూలాంగ్ , గోల్ హనుమాన్ , రాజ రాజేంద్ర థియేటర్ చౌరస్తా , వర్ని రోడ్డు , వినాయక్ నగర్ , హనుమాన్ జంక్షన్ , బోర్గాం గ్రామం , రైల్వే కమాన్ , సుభాష్ నగర్ , రైతు బజార్ , చంద్ర శేఖర్ కాలనీ , గౌతమ్ నగర్ జండా , దుబ్బ , హమల్ వాడి , గుర్భా బాధిరోడ్డు , తదితర ప్రాంతాలను పర్యవేక్షించడం జరిగింది.























