బోధన్ బార్ అసోసియేషన్ లో ప్రాక్టీస్ చేస్తున్న మహిళా న్యాయవాది జి. కళ్యాణి పై ఆదివారం రోజు రుద్రూర్ లో గుండాల దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ పేర్కొన్నారు. జరిగిన దాడిని న్యాయవాది రుద్రూర్ పోలీస్ స్టేషన్లో వెంటనే ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యం వహించడం ఇంతవరకు దుండగులను అరెస్ట్ చేయకుండా కు ఉదాసీన వైఖరి అవలంబించడం శోషణీయం అని పేర్కొన్నారురాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న ఇలాంటి విషయాలు హింసాత్మక దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకు, న్యాయవ్యవస్థకు సవాల్గా మారుతున్నాయి.ఈ మహిళా న్యాయవాదిపై పాల్పడ్డ దుండగులను వెంటనే గుర్తించి, హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకొని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు పోలీస్ శాఖనున్యాయవాది పరిషత్ డిమాండ్ చేస్తోంది
ప్రజాస్వామ్య వ్యవస్థ న్యాయవాదులు సేవా దృక్పథంతో నిర్వహిస్తున్న ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు హత్యలు పెరిగిపోవడని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు న్యాయ వ్యవస్థ రక్షణకై ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకుని న్యాయవాద ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు , న్యాయవాది కళ్యాణి పై దాడి చేసిన గుండాలను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఉద్యమిస్తారని ఆయన హెచ్చరించారు.























