ధర్పల్లిలో నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా ఉద్యోగులు నిరసన తెలిపారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ శారంగపాణి, ఎంపీఓ ఎం. శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్ జి. గంగాధర్, జూనియర్ అసిస్టెంట్లు జి. సుధాకర్, ఎం. విజయ్తో పాటు మండల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

























