భక్తిశ్రద్ధలతో గణేష్ నవరాత్రులు నిర్వహించాలి: కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర ఐపీఎస్..
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…
కామారెడ్డి: గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర ఐపీఎస్ సూచించారు. 2026 గణేష్ ఉత్సవాల నేపథ్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన గణేష్ మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

గణేష్ ఉత్సవాలు సామరస్యానికి, భక్తిభావానికి ప్రతీకగా నిలిచేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ కోరారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించాలని తెలిపారు.

ముఖ్యంగా డీజేలు, పెట్టవద్దని చెప్పారు శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్ల వినియోగం విషయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు, వృద్ధులకు ఇబ్బందులు కలిగించకుండా చూడాలని అన్నారు. ఉత్సవాల సమయంలో శాంతిభద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గణేష్ మండపాల వద్ద భక్తుల కోసం అన్నదానం, ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు నిర్వహించాలనుకునే నిర్వాహకులు ముందుగా పోలీస్ శాఖకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమాల నిర్వహణలో రద్దీ, ట్రాఫిక్, భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు చేపట్టేందుకు పోలీసులకు ముందస్తు సమాచారం ఉపయోగపడుతుందని తెలిపారు.
గణేష్ నిమజ్జనం సందర్భంగా కూడా నిర్వాహకులు, భక్తులు పోలీస్ శాఖ సూచనలు పాటిస్తూ సహకరించాలని ఎస్పీ కోరారు. ఉత్సవాలు సజావుగా, ప్రశాంతంగా ముగిసేలా ప్రజలు, గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈకార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నర్సింహా రెడ్డి,సబ్ కలెక్టర్, డిఎస్పీ, సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ కళాబృందం ఇంచార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, శేషరావు, ప్రభాకర్, పాటలద్వారా ఆకట్టుకున్నారు మరియు వివిధ ఉన్నతాధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.

























