ప్రపంచ ఆరోగ్య దినోత్సవ అవగాహన ర్యాలీ
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజాంబాద్ నగరంలో గల దుబ్బ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్రపంచానికి ఆరోగ్య దినోత్సవ అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్గవర్నింగ్ కౌన్సిల్ స్టేట్ చైర్మన్ డాక్టర్ కవితా రెడ్డి గారు మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ మేడం తో కలిసి జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా దుబ్బా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల వీధుల గుండ ఆరోగ్య నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగుతూ చివరికి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఐఐ హెచ్ఎఫ్ డబ్ల్యూ రాష్ట్ర చైర్మన్ కవిత రెడ్డి గారు మాట్లాడుతూ పేద ప్రజ ల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు సంబంధించిన అన్ని రకాల ఆరోగ్య సేవలను అందించడం జరుగుతుందని అన్నారు. తేనెలు ఆశా కార్యకర్తలు ప్రతి గర్భిణీ స్త్రీలకి పోషకాహారము మరియు ఇతర ఆరోగ్య సమస్యలపై వివరిస్తూ రక్తహీనతకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో గల సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో డిఎంహెచ్ఓ డాక్టర్ బి రాజశ్రీ మేడం గారు మాట్లాడుతూ వ్యాధినిర్ధక టీకాలు పోషకాహారము తీసుకోవడంతోపాటు మాత శిశు మరణాలను తగ్గించడం పరిసరాల పరిశుభ్రతను పాటించడం జీవనశైలి లో మార్పులు తీసుకొని జీవనశైలి వ్యాధులైన గుండెజాబ్బులు ,బిపి, మధుమేహం, క్యాన్సర్ లాంటి వ్యాధులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా పర్యావ వరణ పరిరక్షణతో పాటు వాతావరణ కాలుష్యం సంభవించకుండా, గాలి నీరు కలుషితం కాకుండా పోషకాహారంలో కల్తీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు మహిళలందరూ మూఢనమ్మ కాలకు పోకుండా శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలన్నారు. టిబి ముక్తభారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులకు క్షయ నియంత్రణ నిర్ధారణ పరీక్షల కోసం ఎక్స్రేను తీయడం జరిగింది అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ అశ్విని, వివో ఎన్ సి డి డాక్టర్ వెంకన్న, పి ఓ ఎం సి హెచ్ డాక్టర్ శ్వేత ,డీఎస్ఓ &పిఓ ఆమ్ అధికారి డాక్టర్ వెంకటేష్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుప్రియ, డాక్టర్ శిఖరా, డాక్టర్ శ్రావ్య, డాక్టర్ అవంతి, ఏవో రాజేశ్వర్, డిహెచ్ఇలు ఘనపూర్ వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, సలీం, సూపరిండెంట్ వినయ్, సందీప్, నాగరాజు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.























