Homeతెలంగాణ99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం రోడ్డు...

99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం: పోలీస్ కమిషనర్ వెల్లడి ఎడపల్లి గ్రామ ప్రజలకు/ డ్రైవర్స్ కు అవగాహన కార్యక్రమం

99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం: పోలీస్ కమిషనర్ వెల్లడి

ఎడపల్లి గ్రామ ప్రజలకు/ డ్రైవర్స్ కు అవగాహన కార్యక్రమం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం , ప్రజల్లో ట్రాఫిక్ నియమాల పట్ల బాధ్యతాభావం పెంపొందించడం లక్ష్యంగా “అరైవ్ అలైవ్ ” కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి 18 వరకు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా నేడు 6వ రోజు

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ లకు సంబంధించినటువంటి ఎస్సైలు, సీ.ఐ లు, ఏ.సీ.పీ లు మరియు నిజామాబాద్ జిల్లా అదనపు డి.సి.పి (అడ్మిన్) మరియు పోలీస్ కమిషనర్  ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఇందులో భాగముగా నేడు ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మంగళ్ పహాడ్ చౌరస్తా వద్ద ప్రజలతో మరియు డ్రైవర్లతో అవగాహన కార్యక్రమం లో * నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, ఐపీఎస్.,* ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్  మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రతి ఒక్కరి ద్వారా రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం “అరైవ్ అలైవ్ ” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం , మద్యం సేవించి వాహనం నడపడం , డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం , ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వంటి అంశాలేనని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనం నడిపి , తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనలు కుటుంబాలకు తీరని నష్టాన్ని కలిగిస్తాయని తెలియజేసారు. కోవిడ్ సమయంలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 మంది మృతిచెందగా 2025 లో జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వలన 302 మంది తమ ప్రాణాలను కోల్పోయారని తెలియజేశారు. కావున రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరిగి మరణాలు జరుగుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కృషి చేయాలని ఇట్టి కృషి అనేది ప్రతి ఒక్కరీ,నుండి మొదలవ్వాలని తెలియజేశారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్ లో అట్టి ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ తరలిస్తారో , అతనికి ప్రభుత్వం నుంచి ప్రోత్సహించుట కోసం సహార్విర్ పథకం కింద ఉండేటటువంటి 25 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

అనంతరం ట్రాఫిక్ నిబంధనలు తెలియజేసేటటువంటి పాంప్లెంట్లు మరియు పోస్టర్లను విడుదల చేసారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిజ్ఞ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బోధన్ ఏ.సి.పి శ్రీనివాస్, బోధన్ రూరల్ సీ.ఐ  విజయబాబు, ఎడపల్లి ఎస్సై  రామ, బోధన్ రూరల్ ఎస్సై  మచ్చేందర్ రెడ్డి , రెంజల్ ఎస్సై  చంద్రమోహన్ , మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాస్, ఆర్టీసీ సిబ్బంది మరియు ప్రజలు/ఆర్టీసీ డ్రైవర్లు/ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్…

0
ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితా తయారీలో భాగంగా వివరాలు సక్రమంగా నమోదు కాని ఓటర్లకు...

కాంగ్రెస్ కమిటీ మండల ఉపాధ్యక్షులుగా తెడ్డు అశోక్…

0
కాంగ్రెస్ కమిటీ మండల ఉపాధ్యక్షులుగా తెడ్డు అశోక్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా ముచ్కూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు తెడ్డు అశోక్ నియామకం అయ్యారు....

కల్యాణలక్ష్మి పథకం ఎప్పటికీ ఆగదు పిప్రీ సర్పంచ్ అరిగేలా జనార్ధన్…

0
కల్యాణలక్ష్మి పథకం ఎప్పటికీ ఆగదు పిప్రీ సర్పంచ్ అరిగేలా జనార్ధన్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్ నాయకులు అన్నారు....

రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన గడ్డం ఇందుప్రియ…

0
రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన గడ్డం ఇందుప్రియ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... హైదరాబాద్: రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్...

హాసా కొత్తూరు గ్రామంలో VBGRAMG పథకం లోని వ్యవసాయ పనులు ప్రారంభం…

0
హాసా కొత్తూరు గ్రామంలో VBGRAMG పథకం లోని వ్యవసాయ పనులు ప్రారంభం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని హాసకొత్తూర్ గ్రామంలో నిధులు సుమారు 79890/-తో పొడవు,వెడల్పు లు 12...

ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్…

0
ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితా తయారీలో భాగంగా వివరాలు సక్రమంగా నమోదు కాని ఓటర్లకు...

కాంగ్రెస్ కమిటీ మండల ఉపాధ్యక్షులుగా తెడ్డు అశోక్…

0
కాంగ్రెస్ కమిటీ మండల ఉపాధ్యక్షులుగా తెడ్డు అశోక్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా ముచ్కూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు తెడ్డు అశోక్ నియామకం అయ్యారు....

కల్యాణలక్ష్మి పథకం ఎప్పటికీ ఆగదు పిప్రీ సర్పంచ్ అరిగేలా జనార్ధన్…

0
కల్యాణలక్ష్మి పథకం ఎప్పటికీ ఆగదు పిప్రీ సర్పంచ్ అరిగేలా జనార్ధన్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్ నాయకులు అన్నారు....

రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన గడ్డం ఇందుప్రియ…

0
రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన గడ్డం ఇందుప్రియ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... హైదరాబాద్: రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్...

హాసా కొత్తూరు గ్రామంలో VBGRAMG పథకం లోని వ్యవసాయ పనులు ప్రారంభం…

0
హాసా కొత్తూరు గ్రామంలో VBGRAMG పథకం లోని వ్యవసాయ పనులు ప్రారంభం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని హాసకొత్తూర్ గ్రామంలో నిధులు సుమారు 79890/-తో పొడవు,వెడల్పు లు 12...
Translate »
error: Content is protected !!