జూన్ 15లోపు యూనిఫారాల పంపిణీ: సీఎం రేవంత్
తెలంగాణ : జూన్ 15 లోపు విద్యార్థులందరికీ యూనిఫారాలు అందేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందులో ఎలాంటి జాప్యాన్ని సహించబోమని ఆయన హెచ్చరించారు. విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ వ్యాకయలు చేశారు. దుస్తులు, పుస్తకాలు, నోట్ బుక్స్, ఐడీ కార్డులు వంటివి సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారానే సేకరించాలని సూచించారు. సరఫరా వ్యవస్థను పర్యవేక్షించేందుకు ప్రతి మండల స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించాలన్నారు.























