IMA నిజామాబాద్ ఆధ్వర్యంలో CME కార్యక్రమం
ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి
వైద్యులు పేషెంట్స్ మనసు గెలుచుకోవాలి
డబ్బు కోసమే కాకుండా..సేవా దృక్పథంతో వైద్యవృత్తి కొనసాగించాలి
సేవా విభూషణ బిరుదుతో ఎమ్మెల్యేకు సత్కారం
మెడికవర్ ఆసుపత్రి సికింద్రాబాద్ నేతృత్వంలో నిజామాబాద్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం గంగస్థాన్ ఫెస్ -2 లో ఏర్పాటు చేసిన CME కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్డియాలజీ, పల్మనాలజీ, సరికొత్త మరియు నెఫ్రాలజీ విభాగంలో నూతన పోకడలను గురించి సీనియర్ వైద్యులు వివరించారు.
ఈ మేరకు ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి మాట్లాడుతూ.. వైద్యరంగంలో తనకున్న అనుభవాలను కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులతో పంచుకున్నారు. నేటితరం వైద్యులు పేషెంట్స్ ను ఇంప్రెస్ చేసేవిధంగా స్నేహపూర్వకంగా సేవలందించాలని సూచించారు. వైద్యరంగంలో ABC ( ఆటిట్యూడ్, బిహేవియర్, కమిట్మెంట్) ఈ మూడు పద్ధతులను అనుసరించి ముందుకు వెళ్ళాలని సూచించారు. పేషంట్స్ సంతృప్తి చెందితే తప్పకుండా సదరు వైద్యులకు ఆదరణ లభిస్తుందని తెలిపారు.
అటు పలువురు వైద్యులు వైద్యరంగంలో గల పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ను సేవా విభూషణ బిరుదుతో IMA నిజామాబాద్ వారు సత్కరించారు.
ఈ కార్యక్రమంలో IMA నిజామాబాద్ అధ్యక్షులు డా.విశాల్, ప్రధాన కార్యదర్శి డా. హరీష్ స్వామి,కోశాధికారి డా.రామనేశ్వర్, సీనియర్ వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.

























