ఎంపీడీఓ లతో ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి సమీక్షా సమావేశం
సంక్షేమ పథకాలు.. క్షేత్రస్థాయి అంశాల పై సమీక్ష
గృహ నిర్మాణం ఇందిరమ్మ ఇళ్లు,పథకాల అమలు తీరుపై సమీక్ష
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీడీఓ లతో ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెడ్పీ సీఈఓ సాయగౌడ్ నేతృత్వంలో అన్ని మండలాల ఎంపీడీఓ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల సబ్సిడీలు, పథకాల అమలు తీరు, గృహ నిర్మాణం,ఇందిరమ్మ ఇళ్లు, తదితర అంశాల పై సుదీర్ఘంగా చర్చించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం చివరి లబ్ధిదారుడి చెంతకి చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అర్హులైన వారిని గుర్తించి వంద శాతం గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని పరిశీలించి ప్రతిపాదనను ప్రభుత్వానికి నివేదించాలని జెడ్పీ సీఈఓ కు ఎమ్మెల్యే సూచించారు.

























