Homeతెలంగాణఉచిత ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఉచిత ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఉచిత ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి 


నిజామాబాద్, మే 01 : తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచితంగా అందిస్తున్న ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవ్ వాడ లో గల షెడ్యూల్డు కులాల వసతి గృహంలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఫౌండేషన్ కోర్సును కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ప్రారంభించారు. ఇప్పటివరకు 10 బ్యాచ్ లలో 800 మందికి శిక్షణ అందించగా, వారిలో 199 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని ఎస్సీ స్టడీ సర్కిల్ నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం 11వ బ్యాచ్ లో 93 మంది ఫౌండేషన్ కోర్సులో చేరారని, వీరికి ఐదు నెలల పాటు ఉచిత భోజన వసతి సదుపాయాలతో నాణ్యమైన శిక్షణ అందించడం జరుగుతుందన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలు, బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు. వారి విద్యాభివృద్ధికి కూడా ఎనలేని ప్రాధాన్యతనిస్తూ, పోటీ పరీక్షలలో ప్రతిభను కనబర్చి ఉద్యోగ అవకాశాలు పొందేలా స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు సమకూరుస్తూ ఉచితంగా శిక్షణ అందిస్తోందని అన్నారు. ఈ అవకాశాన్ని సరైన విధంగా వినియోగించుకుంటే, ఆశించిన విధంగా ప్రభుత్వ కొలువు దక్కించుకోవచ్చని, భవిష్యత్తు ఎంతో బాగుంటుందని హితవు పలికారు. సమయాన్ని వృధా చేయకుండా, గట్టి సంకల్పంతో కృషి చేయాలని, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ ఏకాగ్రతతో కష్టపడి చదవాలని కర్తవ్యాన్ని బోధించారు. ఆంగ్లంలో నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని సూచించారు. వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కాకముందు నుండే పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని మార్గనిర్దేశం చేశారు. అంతకుముందు కలెక్టర్ వసతి గృహంలోని గదులు, కిచెన్ తదితర వాటిని సందర్శించి భోజన, వసతి సదుపాయాలు పరిశీలించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థుల కోసం పోటీ పరీక్షలకు ఉపయోగపడే అన్ని రకాల బుక్స్ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి రజిత, సహాయ అధికారి రాజ గంగారాం, స్టడీ సర్కిల్ డైరెక్టర్ దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

కారు ఢీకొని పెయింటింగ్‌ కార్మికుడు మృతి చెందాడు

0
పూణే: 48 ఏళ్ల పెయింటింగ్ కార్మికుడు అతనిపై కారు రివర్స్ చేయడంతో మరణించాడు. అంబేగావ్‌లోని దత్తానగర్‌లో బుధవారం సాయంత్రం బాధితుడు కారు వెనుక నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్...

డిసెంబర్ నాటికి 70% ఫ్లీట్ టెక్ స్నాగ్-ఫ్రీ అవుతుంది: MSRTC

0
పూణేలోని స్వర్గేట్ బస్ స్టేషన్ వద్ద MSRTC బస్సులు పూణే: కొత్త బస్సులను ప్రవేశపెట్టడం మరియు వృద్ధాప్య వాహనాలను రద్దు చేయడం వల్ల MSRTC సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని రాష్ట్ర రవాణా...

ధర్పల్లి మండల కేంద్రంలో నాలుగు మహిళా భవనాలకు భూమిపూజ

0
ధర్పల్లి మండల కేంద్రంలో నాలుగు మహిళా భవనాలకు భూమిపూజ శనివారం : 06/06/26 /త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండల కేంద్రంలో మంజూరైన నాలుగు మహిళా భవనాల నిర్మాణ పనులకు...

జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ

0
జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ నిజామాబాద్, జూన్ 5: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), నిజామాబాద్‌లో గుండె వైద్య సేవల విభాగం మరో చారిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. ఆసుపత్రిలో...

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

0
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు హైదరాబాద్, జూన్05: నగరంలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పలు స్పా సెంటర్లపై పోలీస్ బృందాలు శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. దాదాపు...

కారు ఢీకొని పెయింటింగ్‌ కార్మికుడు మృతి చెందాడు

0
పూణే: 48 ఏళ్ల పెయింటింగ్ కార్మికుడు అతనిపై కారు రివర్స్ చేయడంతో మరణించాడు. అంబేగావ్‌లోని దత్తానగర్‌లో బుధవారం సాయంత్రం బాధితుడు కారు వెనుక నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్...

డిసెంబర్ నాటికి 70% ఫ్లీట్ టెక్ స్నాగ్-ఫ్రీ అవుతుంది: MSRTC

0
పూణేలోని స్వర్గేట్ బస్ స్టేషన్ వద్ద MSRTC బస్సులు పూణే: కొత్త బస్సులను ప్రవేశపెట్టడం మరియు వృద్ధాప్య వాహనాలను రద్దు చేయడం వల్ల MSRTC సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని రాష్ట్ర రవాణా...

ధర్పల్లి మండల కేంద్రంలో నాలుగు మహిళా భవనాలకు భూమిపూజ

0
ధర్పల్లి మండల కేంద్రంలో నాలుగు మహిళా భవనాలకు భూమిపూజ శనివారం : 06/06/26 /త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండల కేంద్రంలో మంజూరైన నాలుగు మహిళా భవనాల నిర్మాణ పనులకు...

జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ

0
జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ నిజామాబాద్, జూన్ 5: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), నిజామాబాద్‌లో గుండె వైద్య సేవల విభాగం మరో చారిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. ఆసుపత్రిలో...

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

0
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు హైదరాబాద్, జూన్05: నగరంలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పలు స్పా సెంటర్లపై పోలీస్ బృందాలు శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. దాదాపు...
Translate »
error: Content is protected !!