గత రెండు సంవత్సరాలుగా మరమ్మత్తులు నడుస్తూ ఉన్న పనులు పూర్తి కాకపోవడం విశేషం
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం భగత్ సింగ్ కాలనీ 13వ వార్డు లో గ్రామంలోని ప్రధాన రహదారి అయిన బైపాస్ రోడ్డు గత రెండు సంవత్సరాలుగా మరమ్మత్తులు నడుస్తూ ఉన్న పనులు పూర్తి కాకపోవడం విశేషం దీనిపై కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బైపాస్ రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద రాళ్లు పడి ఉండడం డ్రైనేజీలు ఎక్కడికక్కడ నిలిచిపోయి దోమలతో కాలనీవాసులు అనారోగ్య పాలవుతున్నారని ఎన్నికల అప్పుడే కాలాన్ని కనపడుతుంది నాయకులకు అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం మండల బిజెపి అధ్యక్షులు జీర్రా మహిపాల్ కార్యకర్తలతో కలిసి కాలనీ పరిశీలించగా కాలనీవాసులు వారి ఆవేదనని ఆయనతో చెప్పగా జీర్రా మైపాల్ మీడియాతో మాట్లాడుతూ. భగత్ సింగ్ కాలనీ లో ఇంత పెద్ద ఎత్తున సమస్యలు ఉన్న సర్పంచ్ కండ్లకు కనిపిస్తలేవా ఎమ్మెల్యేకు కనిపిస్తలేదా గోసంగి కాలనీ అని చులకనగా చూస్తున్నారా తక్షణమే స్పందించి కాలనీలోని సమస్యలను నెరవేర్చకపోతే కాలనీవాసులతో రోడ్డెక్కి ధర్నాకు దిగే పరిస్థితి తెచ్చుకోకూడదని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఉపాధ్యక్షులు టేడ్డు శంకర్, బీజేవైఎం మండల అధ్యక్షులు దోర్నాల రాజశేఖర్, జ్ఞానేశ్వర్, చంద్రమౌళి, వినోద్, కుమార్, గోనె రాజేశ్వర్, రాజశేఖర్, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.























