రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపనలో ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
ఆలయంలో ప్రత్యేక పూజలు
అమ్మవారి ఆశీస్సులు ప్రజల పై ఉండాలని ఆకాంక్ష
నిజామాబాద్ రూరల్ మండలం మాధవ్ నగర్ (పాండ్రా) లో గౌడ సంఘం,గ్రామస్తుల సహకారంతో నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్మాణంలో కృషి చేసిన గౌడ సంఘం, గ్రామస్తులను అభినందించారు.
ప్రజలంతా ఐక్యంగా ఉంటూ.. జీవితంలో ఆధ్యాత్మిక భావనను అలవరుచుకోవాలని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజల పై ఉండాలని, నియోజవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.
అటు ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేను ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యేను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయరెడ్డి,మోపాల్ సాయరెడ్డి, ఉమ్మాజి నరేష్, తరుణ్, మునిపల్లి సాయి రెడ్డి, ఫిషరీస్ శ్రీనివాస్,ఆకాశ్ రెడ్డి, గ్రామ గౌడ సంఘం అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు యాదగిరి గౌడ్,వేణు గౌడ్, బాల్ రాజ్ గౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

























