ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు ఘనంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పుట్టినరోజు వేడుకలు..
ఇందూరు: ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతానని, నిరంతరం ప్రజల మధ్య ఉండడమే తనకిష్టమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే పుట్టినరోజును పురస్కరించుకొని నగరంలోని ఆయా డివిజన్లో ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందూరు నగర ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గా ఎదిగానన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతం అన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందజేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
నగరం లోని 19 డివిజన్ కంటేశ్వేర్ ఆలయంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.
జిల్లా జనరల్ ఆసుపత్రిలో పేదలకు పండ్ల పంపిణీ చేపట్టారు. అలాగే మిర్చి కాంపౌండ్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. సుమారు 60 మంది అభిమానులు రక్తదానం చేశారు.
* 27వ డివిజన్ కార్పొరేటర్ కల్పే అర్చనా చిరంజీవి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే 28వ డివిజన్ కార్పొరేటర్ మల్కాయ్ మహేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు లు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ లో పాల్గొన్నారు. అలాగే స్నేహ సొసైటీలో దివ్యాంగ విద్యార్థులకు అన్నదానంతో పాటు పెన్నులు, బిస్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

























