ధర్పల్లి: పొలాల్లో డ్రైనేజీ నీరు.. పరిశీలించిన ఎంపీడీవో
సో మవారం : 18/05/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లిలోని చెరువు కట్ట వద్ద పొలాల్లోకి డ్రైనేజీ నీరు వస్తోందని రైతులు ఇచ్చిన ఫిర్యాదుపై ఎంపీడీవో లక్ష్మారెడ్డి సోమవారం స్పందించారు. ఆయన రైతులతో కలిసి ఆ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. పొలాలు పాడవుతున్నాయని, వెంటనే నాలాలు నిర్మించాలని రైతులు కోరారు. దీనిపై ఎంపీడీవో స్పందిస్తూ.. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు జర్ర మహిపాల్ రైతులు గడ్డి లక్ష్మణ్ ఎర్రోళ్ల భూమన్న దంసా రాములు సరసం లక్పతి మరియు రైతులు పాల్గొన్నారు

























