ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక…
శుక్రవారం : 05/06/26 త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం కుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సంఘం అధ్యక్షుడిగా రెబ్బ నరేష్, ఉపాధ్యక్షుడిగా కొట్టూరు శ్రీనివాస్, కోశాధికారిగా రెబ్బ దశరథ్, కార్యనిర్వహణ అధికారిగా రెబ్బ సతీష్, అలాగే కార్యవర్గ సభ్యుడిగా దైవశెట్టి రెబ్బ శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రెబ్బ నరేష్ మాట్లాడుతూ, తనను మహామేరు క్షత్రియ సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్న కుల సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మహామేరు క్షత్రియ సంఘానికి చెందిన కుల సభ్యులు, పెద్దలు మరియు యువకులు పాల్గొన్నారు.

























