Homeఇందల్వాయి మండల్నిజామాబాద్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. భార్యాభర్తల వివాదం ఉద్రిక్తతకు దారి...

నిజామాబాద్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. భార్యాభర్తల వివాదం ఉద్రిక్తతకు దారి…

నిజామాబాద్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. భార్యాభర్తల వివాదం ఉద్రిక్తతకు దారి…


త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్


నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య నెలకొన్న కుటుంబ వివాదం రెండు తండాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనతో ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

స్థానికుల వివరాల ప్రకారం.. ఒక తండాకు చెందిన యువతి, అదే మండలంలోని మరో తండాకు చెందిన యువకుడిని వివాహం చేసుకుంది. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. అయితే వ్యక్తిగత మనస్పర్థల కారణంగా గత నాలుగేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. ప్రస్తుతం వీరి కుటుంబ వివాదానికి సంబంధించిన కేసు కోర్టులో విచారణలో ఉంది.

ఈ నేపథ్యంలో భర్త తనను దూషించాడని భార్య తన కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో, ఆమె బంధువులు నలుగురు కలిసి అతడిని నిలదీసి దాడి చేసినట్లు సమాచారం. అనంతరం ఈ విషయాన్ని బాధితుడు తన గ్రామస్థులకు తెలియజేయడంతో వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని, అమ్మాయి బంధువులను వారి తండాకు తీసుకెళ్లి ప్రతిదాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొందరు పోలీసులపై కారం చల్లి గొడవకు దిగినట్లు సమాచారం. దీంతో అదనపు పోలీసు బలగాలను తండాకు తరలించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

ఘటనపై స్పందించిన సీఐ వినోద్ మాట్లాడుతూ, భార్యాభర్తల మధ్య ఉన్న వివాదం పెద్ద ఘర్షణకు దారితీసిందని తెలిపారు. ప్రస్తుతం తాము ఘటనాస్థలంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, ఈ ఘటనకు సంబంధించి కొందరిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి భేటీ…

0
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి భేటీ  నియోజకవర్గ అభివృద్ధి పై చర్చ   సీఎం ను శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు...

నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ఢీకొని వృద్ధ ప్రయాణికురాలు మృతి…

0
నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ఢీకొని వృద్ధ ప్రయాణికురాలు మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ డిపో–1కు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ...

ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు…

0
ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు...  ఏ గణేష్ పటేల్ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ పోతంగల్ ఆగస్టు 26: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బుధవారం రోజున ముస్లిం సహోదరులు...

మరుగుతున్న మహాసముద్రం…

0
మరుగుతున్న మహాసముద్రం 'ఎల్ నినో'తో పొంచి ఉన్న పెను ముప్పు ప సిఫిక్ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.6 డిగ్రీలుగా నమోదు 1877 రికార్డు బద్దలుకొడుతూ గరిష్ట ఉష్ణోగ్రతలు వాతావరణ సమతుల్యత భారీగా గతితప్పే...

వీధి కుక్కలతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సర్పంచ్ చలిమెల శ్రీనివాస్…

0
వీధి కుక్కలతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సర్పంచ్ చలిమెల శ్రీనివాస్.. త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామంలో వీధి కుక్కల బెడద నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి భేటీ…

0
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి భేటీ  నియోజకవర్గ అభివృద్ధి పై చర్చ   సీఎం ను శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు...

నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ఢీకొని వృద్ధ ప్రయాణికురాలు మృతి…

0
నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ఢీకొని వృద్ధ ప్రయాణికురాలు మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ డిపో–1కు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ...

ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు…

0
ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు...  ఏ గణేష్ పటేల్ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ పోతంగల్ ఆగస్టు 26: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బుధవారం రోజున ముస్లిం సహోదరులు...

మరుగుతున్న మహాసముద్రం…

0
మరుగుతున్న మహాసముద్రం 'ఎల్ నినో'తో పొంచి ఉన్న పెను ముప్పు ప సిఫిక్ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.6 డిగ్రీలుగా నమోదు 1877 రికార్డు బద్దలుకొడుతూ గరిష్ట ఉష్ణోగ్రతలు వాతావరణ సమతుల్యత భారీగా గతితప్పే...

వీధి కుక్కలతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సర్పంచ్ చలిమెల శ్రీనివాస్…

0
వీధి కుక్కలతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సర్పంచ్ చలిమెల శ్రీనివాస్.. త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామంలో వీధి కుక్కల బెడద నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...
Translate »
error: Content is protected !!