Homeతెలంగాణసోనం వాంగ్‌చుక్‌కు మద్దతుగా నందిపేటలో విద్యార్థుల ర్యాలీ...

సోనం వాంగ్‌చుక్‌కు మద్దతుగా నందిపేటలో విద్యార్థుల ర్యాలీ…

సోనం వాంగ్‌చుక్‌కు మద్దతుగా నందిపేటలో విద్యార్థుల ర్యాలీ…

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని జేఏసీ నేతల డిమాండ్


త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ 


నందిపేట, జూలై 19 (త్రిశూల్ న్యూస్): లడక్‌కు చెందిన ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నీట్-యూజీ ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనపై నిరసనగా చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా శనివారం నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

బస్టాండ్ నుంచి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు సాగిన ర్యాలీలో విద్యార్థులు, యువకులు, జేఏసీ నాయకులు పాల్గొని నీట్ పరీక్షల్లో పారదర్శకతను కల్పించాలని నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు శౌకతుల్ భారీ మాట్లాడుతూ, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరారు. సోనం వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

“దేశ తలరాతను మార్చేది పార్లమెంట్ కాదు.. పాఠశాల” అని పేర్కొంటూ, విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షా విధానం పూర్తిగా పారదర్శకంగా ఉండాలని అన్నారు. విద్యార్థులకు అన్యాయం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రైతు కూలీ గంగన్న, సర్పంచ్ సిలిండర్ లింగం, విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నూతన ఇన్‌స్టంట్ గురు బ్రాంచ్ ప్రారంభం…

0
నూతన ఇన్‌స్టంట్ గురు బ్రాంచ్ ప్రారంభం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి పట్టణంలో 49 వార్డులో ఓల్డ్ బస్టాండ్ జనని హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన “ఇన్‌స్టంట్ గురు”డెలివరీ బ్రాంచ్‌ను టిపిసిసి...

ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్…

0
ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితా తయారీలో భాగంగా వివరాలు సక్రమంగా నమోదు కాని ఓటర్లకు...

కాంగ్రెస్ కమిటీ మండల ఉపాధ్యక్షులుగా తెడ్డు అశోక్…

0
కాంగ్రెస్ కమిటీ మండల ఉపాధ్యక్షులుగా తెడ్డు అశోక్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా ముచ్కూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు తెడ్డు అశోక్ నియామకం అయ్యారు....

కల్యాణలక్ష్మి పథకం ఎప్పటికీ ఆగదు పిప్రీ సర్పంచ్ అరిగేలా జనార్ధన్…

0
కల్యాణలక్ష్మి పథకం ఎప్పటికీ ఆగదు పిప్రీ సర్పంచ్ అరిగేలా జనార్ధన్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్ నాయకులు అన్నారు....

రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన గడ్డం ఇందుప్రియ…

0
రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన గడ్డం ఇందుప్రియ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... హైదరాబాద్: రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్...

నూతన ఇన్‌స్టంట్ గురు బ్రాంచ్ ప్రారంభం…

0
నూతన ఇన్‌స్టంట్ గురు బ్రాంచ్ ప్రారంభం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి పట్టణంలో 49 వార్డులో ఓల్డ్ బస్టాండ్ జనని హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన “ఇన్‌స్టంట్ గురు”డెలివరీ బ్రాంచ్‌ను టిపిసిసి...

ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్…

0
ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితా తయారీలో భాగంగా వివరాలు సక్రమంగా నమోదు కాని ఓటర్లకు...

కాంగ్రెస్ కమిటీ మండల ఉపాధ్యక్షులుగా తెడ్డు అశోక్…

0
కాంగ్రెస్ కమిటీ మండల ఉపాధ్యక్షులుగా తెడ్డు అశోక్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా ముచ్కూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు తెడ్డు అశోక్ నియామకం అయ్యారు....

కల్యాణలక్ష్మి పథకం ఎప్పటికీ ఆగదు పిప్రీ సర్పంచ్ అరిగేలా జనార్ధన్…

0
కల్యాణలక్ష్మి పథకం ఎప్పటికీ ఆగదు పిప్రీ సర్పంచ్ అరిగేలా జనార్ధన్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్ నాయకులు అన్నారు....

రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన గడ్డం ఇందుప్రియ…

0
రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన గడ్డం ఇందుప్రియ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... హైదరాబాద్: రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్...
Translate »
error: Content is protected !!