కారేగాం–సుంకిని గ్రామాల మధ్య కొండచిలువ కలకలం…
త్రిశూల్ న్యూస్ పోతంగల్ మండల్ రిపోర్టర్ ఏ గణేష్
నిజామాబాద్ జిల్లా: పొతంగల్ మండలంలోని కారేగాం–సుంకిని గ్రామాల మధ్య కొండచిలువ కనిపించడం కలకలం రేపింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మంజీరా నది ఒడ్డున ఉన్న పంట పొలాల్లోకి వచ్చిన కొండచిలువ ఓ కోతిని మింగినట్లు స్థానిక రైతులు గుర్తించారు.
పొలాలకు వెళ్లిన రైతులకు కొండచిలువ కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల రైతులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం కొండచిలువను చంపి, దాని కడుపులో నుంచి మింగిన కోతిని బయటకు తీశారు.
ఈ ఘటనతో మంజీరా నది పరివాహక ప్రాంతంలోని రైతులు అప్రమత్తంగా ఉండాలని గ్రామ పెద్దలు సూచించారు. ముఖ్యంగా పంట పొలాలకు వెళ్లే సమయంలో పరిసరాలను జాగ్రత్తగా గమనించాలని కారేగాం, సుంకిని గ్రామాల సర్పంచ్లు రైతులకు సూచించారు.

























