మంచిప్పను ముంపు నుండి కాపాడి.. అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే నా లక్ష్యం : సర్పంచ్ తూర్పు గంగామణి…
నిజామాబాద్ జిల్లాలో కీలకమైన మంచిప్ప గ్రామ భవిష్యత్తు అప్పుడు అభివృద్ధి మరియు మనుగడ మధ్య ఊగిసలాడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మంచిప్ప గ్రామపంచాయతీ పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని తూర్పు గంగామణి గ్రామ ఉనికిని కాపాడటంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మంచిప్ప రిజర్వాయర్ ముంపు సమస్య నుండి గ్రామాన్ని రక్షించుకుంటూ, పంచాయతీ ఎదుగుదల కోసం ఆమె చేస్తున్న కృషి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తరుణంలో, ప్రభుత్వ అండదండలతో మంచిప్ప పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తూర్పు గంగామణి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గ్రామంలోని అంతర్గత రోడ్ల విస్తరణ, మురుగు కాలువల ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి వంటి పథకాలను రాజకీయాలకు అతీతంగా ప్రతి గడపకూ చేరవేస్తున్నారు.
స్థానిక పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన మరియు ఆరోగ్య కేంద్రం బలోపేతం కోసం కృషి చేస్తున్నారు.
“మంచిప్ప గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో భాగంగా, గ్రామాన్ని ముంపు నుండి తప్పించి, ఒక మోడల్ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడమే తన ధ్యేయంగా , కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో నిధులు మంజూరు చేయించి, గ్రామాభివృద్ధిని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తున్నారు.
గ్రామం ఉనికిని కాపాడి, మౌలిక వసతులు కల్పించడంలో సర్పంచ్ తూర్పు గంగామణి ఎల్లవేళలా కృషి చేస్తున్నారు.
ఇప్పటికే అరువైన నిరుపేద ప్రజలకి ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయించడమే కాక ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేయించారు.
మంచిప్ప గ్రామపంచాయతీని ముంపు నుండి రక్షించి, అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా పని చేస్తున్న మంచిప్ప సర్పంచ్ తూర్పు గంగామణి.
గ్రామం తరలిపోవద్దు – ప్రగతి ఆగవద్దు అనే నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో ముందుకు సాగుతున్నారు.
**మన సర్పంచ్ – మన అభివృద్ధి – మన మంచిప్ప!*

























