దివ్యాందివ్యాంగులకు సానుభూతి కాదు.. అవకాశాలు, ఆత్మగౌరవం, సాధికారత కల్పించాలి ఎంపీ అరవింద్…
నిజామాబాద్, సెప్టెంబర్ 17: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా దినంగా భావిస్తూ దివ్యాంగులు, వయోవృద్ధులకు సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
దివ్యాంగులకు సానుభూతి కంటే అవకాశాలు, అందుబాటు, గౌరవం, సాధికారత అవసరమని ఎంపీ అన్నారు. సహాయక పరికరాలు వారి స్వాతంత్ర్యం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవానికి తోడ్పడతాయని పేర్కొన్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రూ.2.10 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వ నిధులతో సుమారు 1,000 మంది దివ్యాంగులు, వయోవృద్ధులకు 19 రకాల సహాయక పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డా. వీరేంద్ర కుమార్కు ఎంపీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మారుమూల గ్రామాల్లోని అర్హులెవరూ ప్రభుత్వ సహాయానికి దూరం కాకుండా చూడాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, స్రవంతి రెడ్డి, ప్రమోద్, కార్పొరేటర్లు నాగొల్ల లక్ష్మీనారాయణ, వైష్ణవి సుధా, జ్యోతి మురళి, ప్రసూన శ్రీనివాస్ రెడ్డి, మహిళా శిశు వికలాంగుల శాఖ జిల్లా అధికారి సౌందర్య, అలింకో ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

























