25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్
పోతంగల్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పోతంగల్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకుని ప్రధాని మోదీ జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, దేశ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ అంకితభావంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రహదారుల అభివృద్ధి, ఆర్థిక రంగంలో సంస్కరణలు, ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి కార్యక్రమాల ద్వారా దేశ ప్రగతికి కృషి చేస్తున్నారని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయ స్థాయిలో తన ప్రాధాన్యతను పెంచుకుంటోందని నాయకులు పేర్కొన్నారు. ప్రజాసేవకు అంకితమైన ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో కూడిన దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పోతంగల్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

























