నూతనంగా నియమితులైన బీజేపీ నాయకులకు ఘన సన్మానం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్
పోతంగల్: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడిగా ఓమన్నా పటేల్, మైనార్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా నయీముద్దీన్ నియమితులైన సందర్భంగా పార్టీ నాయకులు వారిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఓమన్నా పటేల్, నయీముద్దీన్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులు పార్టీ నాయకత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

























