ప్రమాదవశాత్తు తుపాకీ పేలి రిజర్వ్ ఇన్స్పెక్టర్ మృతి…
నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ హెడ్క్వార్టర్స్లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో రిజర్వ్ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) హెచ్. సతీష్ మృతి చెందారు.
పోలీస్ కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఎన్ఎస్ఓ డ్యూటీ ముగించుకుని వచ్చిన అనంతరం శుక్రవారం ఉదయం హెచ్. సతీష్ తన వద్ద ఉన్న ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు మిస్ఫైర్ జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన మృతి చెందినట్లు పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న వెంటనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఐపీఎస్ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలపై పోలీసు అధికారులు విచారణ చేపట్టారు.

























