ధర్పల్లిలో బీజేపీకి షాక్: వార్డు మెంబర్ కాంగ్రెస్ లోకి
బుధవారం : 29/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం 8వ వార్డు సభ్యుడు, బీజేపీ బూత్ అధ్యక్షుడు ఘనపురం రాజు, బుధవారం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకాన్ని చూరగొందని, అదే నమ్మకంతో తాను పార్టీలో చేరినట్లు రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిసిసి వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాల్రాజ్, ధర్పల్లి గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్, మాజీ సొసైటీ చైర్మన్ మల్లికార్జున్, చక్రపాణి, దినకర్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.























