అప్పుల బాధతో రైతు ఆత్మహత్య: నిజామాబాద్ జిల్లాలో విషాదం
బుధవారం : 29/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లాలోని హోన్నజిపెట్ గ్రామానికి చెందిన బాసవోయిన నరసయ్య (51) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. తనకున్న ఒక ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నరసయ్య, పెద్ద కూతురి పెళ్లి సమయంలో చేసిన అప్పులు తీర్చలేక మనస్థాపానికి గురయ్యారు. ఈ క్రమంలో, తన వ్యవసాయ భూమి దగ్గరలోని వేప చెట్టుకు ఉరివేసుకుని ఆయన మృతి చెందారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.























