ధర్పల్లి మండలంలో ఘనంగా మేడే వేడుకలు
ధర్పల్లి మండలంలో టీయూసీఐ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా సంయుక్త కార్య దర్శి రమేశ్ జెండా ఆవిష్కరించి వందనం స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. కార్మికులు ప్రగతి రథచక్రాలని, వారికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. కేంద్రం వెంటనే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికులకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కార్మికులు పాల్గొన్నారు.























