నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్ లపై కఠిన చర్యలు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గర్బస్తపూర్వ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశం ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారి అధ్యక్షతన డిఎంహెచ్వో కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ ప్రతి స్కానింగ్ కేంద్రాన్ని రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించాలని, రేడియాలజిస్టులు మరియు గైనకాలజిస్టులు స్కానింగ్ చేయుటకు అర్హులని అదేవిధంగా కార్డియాలజిస్ట్ మరియు ఆప్తమాలజిస్ట్ కూడా స్కానింగ్ చేయవచ్చు అన్నారు.పి సి పి ఎన్ డి టి చట్టం ద్వారా నమోదు అయినా వైద్యులు మాత్రమే స్కానింగ్ మిషన్లను వాడాలి నమోదు కానీ వైద్యులు స్కానింగ్ మిషన్ల ద్వారా గర్భిణీ స్త్రీలను స్కానింగ్ చేయరాదని తెలియజేసినారు. ఏ వైద్యులు అయితే స్కానింగ్ మిషన్ కొనదలచినారో వారు ముందుగా జిల్లా వైద్యాధికారి గారి కార్యాలయం నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) తప్పనిసరిగా తీసుకోవాలి. తర్వాత స్కానింగ్ మిషన్ వచ్చిన ఫార్మ్ బి సర్టిఫికెట్ లో కొత్త స్కానింగ్ మిషన్ వివరాలు అలాగే దానిని ఉపయోగించే వైద్యుని వివరాలు ఉండాలి అని తెలియజేసినారు. అదేవిధంగా స్కానింగ్ చేసిన తర్వాత పుట్టబోయే శిశువు అమ్మాయా, అబ్బాయా అని తెలియజేయరాదని, ఒకవేళ చట్టం నియమ నీబంధనలను ఉల్లంఘించి ఎవరైనా పుట్టబోయే శిశువు అమ్మాయి అని తెలియజేసి, వెంటనే గర్భ విచ్చిత్తి కి పాల్పడినట్లయితే వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోబడతాయని అన్నారు. ప్రతి స్కానింగ్ కేంద్రంలో వైద్యుల సమయపాలన వేళలను చార్ట్ ద్వారా ప్రదర్శించాలని తెలియజేశారు. జిల్లాలో మొత్తం 131 స్కానింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయని వీటిలో 87 నిజామాబాద్ డివిజన్లో, 30ఆర్మూర్ డివిజన్లో, 14 బోధన డివిజన్లో ఉన్నాయన్నారు. గత మూడు నెలల్లో జిల్లాలో 96 స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేశామన్నారు. స్కానింగ్ యొక్క ఫామ్ ఎఫ్ పైన ప్రతి గర్భిణీ స్త్రీ యొక్క పేరు ,వయస్సు, లింగం, చివరిసారి రుతుస్రావం అయిన తేదీ, అన్ని రకాల ప్రమాదా లక్షణాలను వ్రాయాలన్నారు. రాష్ట్రంలో కానీ ,జిల్లాలో కానీ, ఏ స్కానింగ్ కేంద్రాన్ని అయినా కేంద్ర తనిఖీ బృందాలు జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఎప్పుడైనా ఎక్కడైనా తనిఖీ చేసే అధికారం ఉందన్నారు. ప్రతి స్కానింగ్ నకు డాక్టర్ యొక్క సిఫారసు ధ్రువపత్రం తప్పకుండా అవసరమని, ఈ సమావేశంలో నాలుగు ఆసుపత్రిలోని స్కానింగ్ కేంద్రా లకు అనుమతించిడం జరిగిందని తర్వాత జిల్లా కలెక్టర్ గారి అనుమతి కోసం పంపించడం జరుగుతుందన్నారు.పి సి పి ఎన్ డి టి చట్టాని ఉల్లంఘించడం ద్వారా సమాజంలో స్త్రీ పురుషుల యొక్క నిష్పత్తి తగ్గిపోతున్నదని పుట్టబోయే శిశువు అమ్మాయి అయినా అబ్బాయి అయినా అందరూ సమానమే అని ప్రజల్లో విస్తృతంగా అవగాహన కలిగించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు రేడియాలజిస్ట్ డాక్టర్ నిషిత, గైనకాలజిస్ట్ డాక్టర్ నీ షాత్ ,చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ శరత్ చంద్ర ,ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుప్రియ ,డాక్టర్ శిఖర, డాక్టర్ శ్వేత, డాక్టర్ వెంకటేష్, డి హెచ్ ఈలు వేణుగోపాల్ , ఘన్పూర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.























