Homeతెలంగాణనిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్ లపై కఠిన చర్యలు

నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్ లపై కఠిన చర్యలు

నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్ లపై కఠిన చర్యలు


జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గర్బస్తపూర్వ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశం ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారి అధ్యక్షతన డిఎంహెచ్వో కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ ప్రతి స్కానింగ్ కేంద్రాన్ని రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించాలని, రేడియాలజిస్టులు మరియు గైనకాలజిస్టులు స్కానింగ్ చేయుటకు అర్హులని అదేవిధంగా కార్డియాలజిస్ట్ మరియు ఆప్తమాలజిస్ట్ కూడా స్కానింగ్ చేయవచ్చు అన్నారు.పి సి పి ఎన్ డి టి చట్టం ద్వారా నమోదు అయినా వైద్యులు మాత్రమే స్కానింగ్ మిషన్లను వాడాలి నమోదు కానీ వైద్యులు స్కానింగ్ మిషన్ల ద్వారా గర్భిణీ స్త్రీలను స్కానింగ్ చేయరాదని తెలియజేసినారు. ఏ వైద్యులు అయితే స్కానింగ్ మిషన్ కొనదలచినారో వారు ముందుగా జిల్లా వైద్యాధికారి గారి కార్యాలయం నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) తప్పనిసరిగా తీసుకోవాలి. తర్వాత స్కానింగ్ మిషన్ వచ్చిన ఫార్మ్ బి సర్టిఫికెట్ లో కొత్త స్కానింగ్ మిషన్ వివరాలు అలాగే దానిని ఉపయోగించే వైద్యుని వివరాలు ఉండాలి అని తెలియజేసినారు. అదేవిధంగా స్కానింగ్ చేసిన తర్వాత పుట్టబోయే శిశువు అమ్మాయా, అబ్బాయా అని తెలియజేయరాదని, ఒకవేళ చట్టం నియమ నీబంధనలను ఉల్లంఘించి ఎవరైనా పుట్టబోయే శిశువు అమ్మాయి అని తెలియజేసి, వెంటనే గర్భ విచ్చిత్తి కి పాల్పడినట్లయితే వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోబడతాయని అన్నారు. ప్రతి స్కానింగ్ కేంద్రంలో వైద్యుల సమయపాలన వేళలను చార్ట్ ద్వారా ప్రదర్శించాలని తెలియజేశారు. జిల్లాలో మొత్తం 131 స్కానింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయని వీటిలో 87 నిజామాబాద్ డివిజన్లో, 30ఆర్మూర్ డివిజన్లో, 14 బోధన డివిజన్లో ఉన్నాయన్నారు. గత మూడు నెలల్లో జిల్లాలో 96 స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేశామన్నారు. స్కానింగ్ యొక్క ఫామ్ ఎఫ్ పైన ప్రతి గర్భిణీ స్త్రీ యొక్క పేరు ,వయస్సు, లింగం, చివరిసారి రుతుస్రావం అయిన తేదీ, అన్ని రకాల ప్రమాదా లక్షణాలను వ్రాయాలన్నారు. రాష్ట్రంలో కానీ ,జిల్లాలో కానీ, ఏ స్కానింగ్ కేంద్రాన్ని అయినా కేంద్ర తనిఖీ బృందాలు జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఎప్పుడైనా ఎక్కడైనా తనిఖీ చేసే అధికారం ఉందన్నారు. ప్రతి స్కానింగ్ నకు డాక్టర్ యొక్క సిఫారసు ధ్రువపత్రం తప్పకుండా అవసరమని, ఈ సమావేశంలో నాలుగు ఆసుపత్రిలోని స్కానింగ్ కేంద్రా లకు అనుమతించిడం జరిగిందని తర్వాత జిల్లా కలెక్టర్ గారి అనుమతి కోసం పంపించడం జరుగుతుందన్నారు.పి సి పి ఎన్ డి టి చట్టాని ఉల్లంఘించడం ద్వారా సమాజంలో స్త్రీ పురుషుల యొక్క నిష్పత్తి తగ్గిపోతున్నదని పుట్టబోయే శిశువు అమ్మాయి అయినా అబ్బాయి అయినా అందరూ సమానమే అని ప్రజల్లో విస్తృతంగా అవగాహన కలిగించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు రేడియాలజిస్ట్ డాక్టర్ నిషిత, గైనకాలజిస్ట్ డాక్టర్ నీ షాత్ ,చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ శరత్ చంద్ర ,ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుప్రియ ,డాక్టర్ శిఖర, డాక్టర్ శ్వేత, డాక్టర్ వెంకటేష్, డి హెచ్ ఈలు వేణుగోపాల్ , ఘన్పూర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వావిలాల పాఠశాలలో వనమహోత్సవం…

0
వావిలాల పాఠశాలలో వనమహోత్సవం... జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, విద్యార్థుల్లో మొక్కల సంరక్షణపై...

నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి…

0
నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం చోటుచేసుకుని ఓ వృద్ధ ప్రయాణికురాలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ ప్రధాన...

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి... విద్యా సంస్థలను దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులను కలిగించవద్దు... టిఎన్ఎస్ఎఫ్,టిజెఎస్,టి ఎన్విఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్ ఇండియా...

జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు!

0
జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు! తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల...

ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి…

0
ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోని అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF)...

వావిలాల పాఠశాలలో వనమహోత్సవం…

0
వావిలాల పాఠశాలలో వనమహోత్సవం... జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, విద్యార్థుల్లో మొక్కల సంరక్షణపై...

నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి…

0
నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం చోటుచేసుకుని ఓ వృద్ధ ప్రయాణికురాలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ ప్రధాన...

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి... విద్యా సంస్థలను దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులను కలిగించవద్దు... టిఎన్ఎస్ఎఫ్,టిజెఎస్,టి ఎన్విఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్ ఇండియా...

జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు!

0
జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు! తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల...

ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి…

0
ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోని అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF)...
Translate »
error: Content is protected !!