ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నిజామాబాద్లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. నాగ మోహన్ రావు, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. రవికిరణ్, ఎంసిహెచ్ విభాగం డిప్యూటీ సూపరింటెండెంట్ డా. శ్రీకాంత్, డా. హరీష్ స్వామి, డా. రాజేందర్, గ్రేడ్-1 నర్సింగ్ సూపరింటెండెంట్ చంద్రకళ, సిబ్బంది నర్సులు మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నర్సింగ్ సిబ్బంది దీపప్రజ్వలన కార్యక్రమం నిర్వహించి, ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలను స్మరించుకున్నారు. అనంతరం నర్సింగ్ ప్రతిజ్ఞను అందరూ కలిసి స్వీకరించారు.
సూపరింటెండెంట్ డా. నాగ మోహన్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మరియు ఎంసిహెచ్ బ్లాక్లో నర్సింగ్ సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలందించిన నర్సుల సేవలు మరువలేనివని కొనియాడారు. రోగుల పట్ల కరుణ, సేవాభావం, అంకితభావంతో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది వైద్య రంగానికి వెన్నెముకలని అన్నారు.
కార్యక్రమంలో నర్సింగ్ సిబ్బంది సేవలను గుర్తిస్తూ అభినందనలు తెలియజేశారు.























