ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నిజామాబాద్లో తొలి యాంజియోగ్రామ్ విజయవంతం
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నిజామాబాద్లో తొలి యాంజియోగ్రామ్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించబడినట్లు ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డా. నాగ మోహన్ రావు తెలిపారు.
సింకోపల్ అటాక్స్తో బాధపడుతున్న యాదయ్యకు ఈ రోజు ఉదయం యాంజియోగ్రామ్ విజయవంతంగా నిర్వహించబడింది. కార్డియాలజీ మరియు వైద్య బృందం సమిష్టి కృషితో ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఆధునిక గుండె వైద్య సేవల బలోపేతానికి ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని డా. నాగ మోహన్ రావు పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి నిరంతరం కృషి చేస్తోందన్నారు. డా. నాగ మోహన్ రావుఇన్చార్జ్ సూపరింటెండెంట్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నిజామాబాద్.























