టౌన్ 6 పి.ఎస్ పరిధిలో పేకాట స్థావరంపై చీత ఫోర్స్ మెరుపు దాడి : పోలీస్ కమీషనర్ వెల్లడి
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్న నేపథ్యంలో సి.సి.ఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీత ఫోర్స్ సిబ్బంది నేడు 6 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగాపూర్ ప్రాంతంలో, జిల్లా జైలు పక్కన నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై మెరుపు దాడి నిర్వహించారు.
పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో చీత ఫోర్స్ సిబ్బంది ఆకస్మికంగా అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టగా , కొందరు వ్యక్తులు బహిరంగంగా పేకాట ఆడుతూ కనిపించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా , మొత్తం 5 మంది పేకాట రాయుళ్లను పట్టుకున్నారు.
దాడి సందర్భంగా వారి వద్ద నుండి 3 సెల్ ఫోన్లు మరియు రూ.12,530/- నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పట్టుబడిన వ్యక్తులను మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం 6 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ కి అప్పగించారు.
ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, కమిషనరేట్ పరిధిలో పేకాట, గుట్కా, గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా పేకాట , గంజాయి , డ్రగ్స్ లేదా ఇతర అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని పోలీస్ శాఖ సూచించింది.

























