నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులతో నేరల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్
హనుమాన్ జయంతి పండుగ సందర్భంగా శాంతి భద్రతలను పటిష్ట పరచవలెను
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి ప్రజలలో రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించాలి
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాదు ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసుల పురోగతి పై నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., సమగ్ర సమీక్ష సమావేశం చేపట్టారు. ఈ సమావేశంలో అన్ని డివిజన్ల ఏ.సీ.పీలు , సర్కిల్ ఇన్స్పెక్టర్లు , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
*ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ*
🔷 హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను పటిష్ట పరచాలని ఆదేశించారు.
🔷ప్రత్యేకంగా ఎక్కువకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. కేసుల పురోగతిని తరచూ సమీక్షిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
🔷నిజామాబాదు లో పెరుగుతున్న వైట్ కాలర్ నేరాలపై ప్రధానంగా సైబర్ మోసాలు, బ్యాంకింగ్ ఫ్రాడ్లు, ఆర్థిక నేరాలు, నకిలీ పత్రాల తయారీ వంటి అంశాలపై చర్చించి, కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, నేరాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ప్రత్యేక బృందాల ఏర్పాటు చేయాలని , సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని , ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. బాధితులకు త్వరిత న్యాయం అందేలా చూడాలని సూచించారు.
🔷 రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలలో బ్లాక్ స్పాట్లను గుర్తించి , సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. హైవే రోడ్డులను కలుపుతూ ఉండేటటువంటి లింకు రోడ్లకు స్పీడ్ బ్రేకర్లు వేయించడం , రోడ్డుకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించే విధముగా చూడాలని అన్నారు. రోడ్డు ఇంజనీరింగ్ లోపాలు ఉన్నట్లయితే నేషనల్ హైవే మరియు స్టేట్ హైవే అథారిటీ ఇతర సంబంధిత అధికారులతో సమన్వయంతో ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి రోజు మీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించాలని , ఓవర్ స్పీడ్ , త్రిబుల్ డ్రైవింగ్ , మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో రోడ్డు భద్రత నిబంధనల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్ ) జి. బస్వా రెడ్డి, నిజామాబాద్ ఏ.సి.పి బి ప్రకాష్ , బోధన్ ఏ.సి.పి శ్రీనివాస్, ఆర్మూర్ ఏ.సి.పి వెంకటేశ్వర రెడ్డి , సి.టి.సి, ఏ.సి.పి రాజశేఖర్ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం , సిసిఆర్బి సి.ఐ అంజయ్య, సి.ఐలు , ఎస్సైలు ఐటి కోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.

























