రాష్ట్ర పోలీస్ శాఖ లోని అన్ని విభాగాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డిజిపి సివి ఆనంద్
(సి పి ఆర్ ఓ, డిజిపి కార్యాలయం)
రాష్ట్రంలో శాంతిభద్రతలను సమర్థవంతంగా పరిరక్షించడంతో పాటు ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన, జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖలో సమూల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర డిజిపి సివి ఆనంద్ అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, డీఎస్పీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐల తో ‘సమర్థవంతమైన పోలీసింగ్ ప్రమాణాల అవలంబన’ అనే అంశంపై ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖ పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. మారుతున్న సామాజిక పరిస్థితులు, కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీస్ శాఖ ప్రస్తుత పనితీరులో మార్పు రావాలని ప్రభుత్వం ఆశిస్తోందని డీజీపీ పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన, పైఅధికారుల పట్ల గౌరవం లేకపోవడం, అవినీతి వంటి ప్రతికూల ధోరణులకు అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేశారు. పోలీసు సేవలందింపులో గణనీయమైన మార్పు వస్తుంది























