APREI సొసైటీకి రూ.3.22 కోట్లు విడుదల…
ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ (APREI) సొసైటీకి ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఖర్చుల కోసం ప్రభుత్వం రూ.3.22 కోట్లతో పరిపాలన అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. జులై 8న ఆర్థిక శాఖ జారీ చేసిన బడ్జెట్ రిలీజ్ ఆర్డర్కు అనుగుణంగా ఈ నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.























