బెంగళూరులో కర్ణాటక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…
కర్ణాటక రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ రిజ్వాన్ అర్షద్ గారు మరియు డా. అజయ్ ధరం సింగ్ గారిని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారు బెంగళూరులో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.
రిజ్వాన్ అర్షద్ గారు శివాజీనగర్ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతూ, కర్ణాటక రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఆహార, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అదేవిధంగా డా. అజయ్ ధరం సింగ్ గారు జేవర్గి శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతూ, కర్ణాటక రాష్ట్ర కేబినెట్ మంత్రిగా పెద్ద & మధ్య తరహా నీటిపారుదల, చిన్న నీటిపారుదల, విజ్ఞాన శాస్త్రం & సాంకేతిక శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఇద్దరు మంత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ మర్యాదపూర్వక భేటీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలు అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలిపారు.

























