డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన సబ్ స్టేషన్ఏర్పాటుచేయాలి.వాసరి సాయినాథ్ PYL జిల్లా ఉపాధ్యక్షులు.ప్రజావాణిలో ఫిర్యాదు ఘన్ పూర్ గ్రామంలో కరెంటు కోతలు చాలా ఉన్నాయి.ఘన్ పూర్ గ్రామానికి,డిచ్ పల్లి RS, పోలీస్ క్యాంపుకు సబ్ స్టేషన్ ఒక్కటే ఉండడం వల్ల డిచ్ పల్లి RS లో ప్రాబ్లం వచ్చిన,పోలీస్ క్యాంప్ లో ప్రాబ్లమ్ వచ్చిన ఘన్ పూర్ గ్రామంలో కరెంటు తీసివేయడం జరుగుతుంది. రాత్రి వేళల్లో 3:00నుంచి 4:00 కరెంటు పోతుంది. దీనివల్ల అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. ఘన్ పూర్ గ్రామ పరిధిలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంది.అందులో డయాలసిస్ సెంటర్ కూడా ఉంది. డిగ్రీ అండ్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి MRO, ఎంపీడీఓ ,MEO, అగ్రికల్చర్, మానవతా సదన్, సెట్విన్, వెలుగు,టీటీడీసీ ,ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ఉంది.కావున డయాలసిస్ చేసే క్రమంలో కరెంటు పోయినట్లయితే పేషెంట్ కు తీవ్ర ఇబ్బందులు జరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లు ఉన్నప్పుడు రాత్రివేళలో కరెంటు పోతే మూడు నుంచి నాలుగు గంటల దాకా రావడం లేదు దీనివల్ల అనేక ఇబ్బందులు జరిగినాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మా ఘన్ పూర్ గ్రామానికి ప్రత్యేకంగా కొత్తగా సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బొల్లారందాసు, ఎండి. ఇమ్రాన్, బండి ప్రమోద్, అన్వర్, బాబా తదితరులు పాల్గొన్నారు























