డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల సమాఖ్య కార్యాలయంలో నేడు గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో SERP ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల పురోగతిపై APM రవీందర్ రెడ్డి క్షుణ్ణంగాసమీక్షనిర్వహించారు.ఈ సందర్భంగా LOKOS సభ్యుల E-KYC ప్రక్రియ ఇప్పటివరకు 50 శాతం పూర్తయినందున, మిగిలిన ప్రక్రియనుఈనెలాఖరులోగా 100శాతంపూర్తిచేయాలనిసూచించారు.అలాగే అజీవిక రిజిస్టర్ మొదటి క్వార్టర్ ఎంట్రీలను కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. బ్యాంక్ లింకేజీలో ఈ నెలకు నిర్దేశించిన రూ.21 కోట్ల లక్ష్యంలో ఇప్పటివరకు రూ.17 కోట్ల మేర బ్యాంక్ లింకేజీ పూర్తయిందని, మిగిలిన రూ.4 కోట్లకు సంబంధించిన ఎంసీపీ లను ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేసి బ్యాంకుల్లో సబ్మిట్ చేయాలని సూచించారు.వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయదారులకు అవసరమైన పొంఫౌండ్ పై అవగాహన కల్పించి, సంబంధిత కార్యక్రమాలకు అర్హులైన రైతుల వివరాలను సేకరించాలని సూచించారు. విద్యా కార్యక్రమాలపై కూడా సమీక్ష నిర్వహిస్తూ, 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిన విద్యార్థులను గుర్తించి,వారికి TOSS ద్వారా ఓపెన్ 10th మరియు ఓపెన్ ఇంటర్ విద్యను కొనసాగించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. శ్రీనిధి కార్యక్రమంలో ఈ నెలాఖరులోగా 35 శాతం అచీవ్మెంట్ సాధించడంతో పాటు 90 శాతం రికవరీ లక్ష్యాన్ని చేరుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.సమావేశంలో CCలు, గ్రామ సంఘం VOAs తదితరులు పాల్గొన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేసి, SERP కార్యక్రమాల అమలులో మరింత మెరుగైన పురోగతి సాధించాలని ఏపీఎం రవీందర్ రెడ్డి సూచించారు.























