ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం లో ధర్పల్లి NTR కాలనీకి చెందిన మందుల గణేష్ కుటుంబ కలహాల కారణంగా జీవితంపై విరక్తి చెంది,చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.ఈ విషయం 100 డయల్కు సమాచారం అందడంతో వెంటనేపోలీసుసిబ్బందిస్పందించారు.సమాచారం తెలుసుకున్న దర్పల్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నరేందర్ వెంటనే చెరువు వద్దకు చేరుకుని,ప్రాణాపాయ స్థితిలో చెరువులో ఉన్న మందుల గణేష్ను గుర్తించి, చెరువులోకి దిగి అతడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి ప్రాణాలు కాపాడారు.కానిస్టేబుల్ నరేందర్ సమయస్ఫూర్తితో స్పందించి ఒక ప్రాణాన్ని కాపాడినందుకు పోలీసు అధికారులు ఆయనను అభినందించారు.























