ధర్పల్లి. సిరికొండ. మండలాల బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుల నియామకం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
ధర్పల్లి. సిరికొండ.మండలాల బీజేపీ కిసాన్ మోర్చా నూతన అధ్యక్షులను ఆదివారం నియమించారు. సిరికొండ మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా చౌటుపల్లి ప్రభాకర్, ధర్పల్లి మండల అధ్యక్షుడిగా హొన్నాజీపేట గ్రామానికి చెందిన మైలారం రఘుపతిరెడ్డి నియమితులయ్యారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులాచారి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మరియు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి చేతుల మీదుగా నూతన అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతనంగా ఎన్నికైన వారికి అభినందనలు తెలియజేశారు. అనంతరం రఘుపతిరెడ్డి మాట్లాడుతూ… రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, రైతులకు అందుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

























