ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రెండో వారం ప్రజావాణి కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఎంపీడీవో మారుతి, తహసీల్దార్ టీ. శాంతతో పాటు మండల స్థాయి అధికారులు ప్రజావాణిలో పాల్గొన్నారు.
మండలంలోని సుమారు 22 గ్రామాల ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చి ఫిర్యాదులు చేయవచ్చని ఎంపీడీవో మారుతి తెలిపారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించి, సాధ్యమైనంత వరకు 30 రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమస్య తీవ్రతను బట్టి మరింత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎంపీడీవో పేర్కొన్నారు.

























