జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్
కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసింది.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కే. రంజిత్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు బి. సంతోష్ కుమార్, పి.ఎన్. సాయి ప్రసన్న, సెక్రటరీ తులా శ్రీధర్, జాయింట్ సెక్రటరీ కే. మధుకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎల్. శ్రీనివాస్, ట్రెజరర్ ఎస్. సాయిలు తదితర కార్యవర్గ సభ్యులు ఎస్పీ ని కలిశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నూతన అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పోలీస్ అధికారుల సంక్షేమం, సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం సమష్టిగా పనిచేస్తూ, పోలీస్ శాఖలో ఐక్యతను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

























