అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర 9వ మహాసభలను విజయవంతం చేయాలి…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి: అఖిలభారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 8, 9 తేదీల్లో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రాష్ట్ర 9వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ధర్పల్లి మండల కేంద్రంలో అఖిలభారత రైతు కూలీ సంఘం నాయకులు మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని నాయకులు కోరారు.
ఈ మహాసభలకు అఖిలభారత రైతు కూలీ సంఘం జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు యం. నర్సాగౌడ్, ధర్పల్లి మండల నాయకులు నిమ్మల భూమేశ్వర్, గులాం హుస్సేన్, మాలికి సంజీవ్, పెద్ద రాజగౌడ్, నడిపెన్న తదితరులు పాల్గొన్నారు.

























