కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…
జిల్లా కేంద్రంలో బహుముఖ ప్రజ్ఞాశాలి, హైదరాబాద్ మాజీ మేయర్,ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలను ఈరోజు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది..
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులు మరియు ప్రముఖులు మాట్లాడుతూ, హైదరాబాద్ నగర అభివృద్ధికి మరియు సమాజ శ్రేయస్సుకు కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ చేసిన సేవలను స్మరించుకున్నారు.
హైదరాబాద్ నగర మేయర్గా బాధ్యతలు నిర్వహించిన కాలంలో నగరాభివృద్ధికి, ప్రజారోగ్యానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
హైదరాబాద్ చరిత్ర మరియు సంస్కృతిపై ఆయన రాసిన ‘పిక్టోరియల్ హైదరాబాద్’ (Pictorial Hyderabad) గ్రంథం నేటికీ నగర సమగ్ర చరిత్రకు అత్యుత్తమ ప్రామాణిక గ్రంథంగా నిలిచిందన్నారు.
విద్య, సామాజిక చైతన్యం మరియు బహుజనుల హక్కుల కోసం ఆయన జీవితాంతం కృషి చేశారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఈ జయంతి కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్,బిసి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు, బట్టు విఠల్,పిట్ల శంకర్, రమేష్, రాంచంద్రం, బాలరాజు, నర్సింలు, స్వామి,నితీన్,రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

























