రైతులకు ఉచితంగా మీరా మందు పంపిణీ…
రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగకరమైన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు, ఆర్మూర్ చిన్న బాల్రాజ్ సహకారంతో రెడ్డి ఫౌండేషన్ ప్రతినిధి నిమ్మల వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు వరి పంటలో అధిక దిగుబడి సాధించేందుకు ఉపయోగపడే మీరా మందును ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రైతులకు పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధిక దిగుబడి సాధించేందుకు పాటించాల్సిన పద్ధతులపై సూచనలు అందించారు. రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని నిమ్మల వినయ్ గౌడ్ తెలిపారు.

























