ఘనంగా మహిళా జర్నలిస్ట్ అసోసియేషన్ 2వవార్షికోత్సవ వేడుకలు
మహిళా జర్నలిస్ట్ అసోసియేషన్ 2వవార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు నిజామాబాదు నగరం లోని ఆర్ & బి గెస్ట్ హౌస్ లో రాజకీయ ప్రముఖుల చేతుల మీదుగా వేడుక జరిగింది.2వవార్షికోత్సవ
సందర్భంగా మహిళా జర్నలిస్ట్ ల అసోసియేషన్ సభ్యులు టిపిసీసీ బొమ్ము మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా మహేష్ కుమార్ గౌడ్ తో 2వవార్షికోత్సవ
ఆల్బం ఆవిష్కరణ(ఇనార్గానేషన్) చేసారు.కేక్ కటింగ్ చేస్తూ అధ్యక్షురాలు బైస సంగీత కు కార్యవర్గానికి లావణ్య ,అనిత, ఆశ్ర,అర్చన సహస్ర,రజిత,తులసి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా జర్నలిస్ట్ లు వివిధ స్వచ్చంద కార్యక్రమాలు చేస్తున్నందుకు అభినందించారు.మునుముందు మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పారు.తదుపరి మహిళా జర్నలిస్ట్ లు మహేష్ కుమార్ గౌడ్ ని శాలువ ,పుష్ప గుచ్ఛం తో సన్మానించారు.అదే విధంగా నగర మేయర్ ఉమారాణి ని కూడా సన్మానించారు.ఈ సందర్బంగా మహిళా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలు బైస సంగీత మాట్లాడుతూ జర్నలిస్ట్ ల ఆరోగ్యన్ని దృష్టిలో ఉంచుకొని వారి కై హెల్త్ కాంప్ లు , జర్నలిస్ట్ ప్రయోజనార్ధం ఇతర స్వచ్చంద కార్యక్రమాలు
సంస్థ ఏర్పాటు చేస్తోంది అన్నారు.ఇక ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు జర్నలిస్ట్లు
,ప్రజలకు ప్రయోజనాత్మకంగా ఉండే కార్యక్రమాలు చేస్తాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర నాయకులు రామకృష్ణ ,సీనియర్ జర్నలిస్ట్ లు గోవిందరాజ్,జగ్మోహన్ ఇతర జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.

























