కమ్మర్పల్లి గ్రామపంచాయతీ లో పంట సాగు పై అవగాహన…
త్రిశూల్ న్యూస్ కమ్మర్పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రం అయిన గ్రామ పంచాయతీలో గురువారం గ్రామసభలో నిర్వహించారు. ఈ గ్రామ సభలో రైతులకు ఎలినో ప్రభావం గురించి వివరించిన మండల వ్యవసాయ అధికారి రమ్య శ్రీ. తక్కువ నీటితో పండే పంటలు కంది,పెసర, మినుములు, సజ్జలు ,వంటివి సాగు చేయాలని రైతులకు తెలిజేయాలని చెప్పారు. వరి పంటకి నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు ఇతర పంటలు తక్కువ నీరు అవసరమయ్యే వాటిపై దృష్టి సారించి పంటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ కొత్తపల్లి హారిక,ఉపసర్పంచ్ అశోక్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.

























