శిథిలావస్థలో ఉన్న ఇళ్లను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసిన మున్సిపల్ కమిషనర్ గజానంద్….
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
భీంగల్: వర్షాకాలం నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని భీంగల్ మున్సిపాలిటీ పరిధిలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను మున్సిపల్ అధికారులు పరిశీలించారు. ప్రమాదకరంగా ఉన్న ఇళ్ల యజమానులకు ఇళ్లను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ తెలిపారు.
వర్షాలు కురుస్తున్న సమయంలో పాత, శిథిలావస్థలో ఉన్న భవనాలు కూలిపోయే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారు వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. ప్రజల భద్రతకు మున్సిపాలిటీ తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ తెలిపారు.

























