నిజామాబాద్ బస్టాండ్లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
నిజామాబాద్ ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లో బస్సు ప్రమాదం చోటుచేసుకుని ఓ వృద్ధ ప్రయాణికురాలు మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ ప్రధాన బస్టాండ్లో నిత్యం భారీ రద్దీ ఉంటుంది. ఇలాంటి ప్రదేశంలో బస్సులను అత్యంత జాగ్రత్తగా నడపాల్సి ఉండగా, డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
భీంగల్ నుంచి నిజామాబాద్కు వచ్చిన డిపో-1కు చెందిన ఆర్టీసీ బస్సు బస్టాండ్లోకి వస్తున్న సమయంలో ఓ వృద్ధ ప్రయాణికురాలిని ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ప్రయాణికుల సమాచారంతో అంబులెన్స్ చేరుకుని ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బస్సు ఢీకొనడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. తల వెనుక భాగంతో పాటు ముక్కు, చెవి నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్పై ఆర్టీసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదంపై పూర్తి వివరాలు సేకరించి, బాధ్యులపై విచారణ జరిపించాలని కోరుతున్నారు.
ఆర్టీసీలో చిన్న తప్పిదాలకే చర్యలు తీసుకునే అధికారులు.. ఒక ప్రయాణికురాలి ప్రాణం పోయిన ఘటనలోనూ అదే స్థాయిలో బాధ్యతగా వ్యవహరించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. డ్రైవర్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారా? లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతారా? అనేది వేచి చూడాలి.

























