మహిళా సంఘం భవనంలో విద్యుత్ సరఫరా: సర్పంచ్ చొరవతో సమస్య పరిష్కారం
గురువారం : 30/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండల కేంద్రంలోని మహిళా సంఘం భవనంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం మూత్రశాలలు కూడా సరిగా లేకపోవడంతో వారి అసౌకర్యం మరింత పెరిగింది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్, మహిళా సంఘం అధ్యక్షురాలు రాజమణి అభ్యర్థన మేరకు వెంటనే స్పందించి విద్యుత్ కనెక్షన్ ఇప్పించారు. ధర్పల్లి గ్రామపంచాయతీ నిధులతో మహిళా భవనానికి విద్యుత్ మీటర్ ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మేళ్ళ శ్రీనివాస్, CC అనురాధ, వార్డు సభ్యులు శ్రావణ్, రాజు పాల్గొన్నారు.























